దేశవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 64 గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోటలో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతను చేపట్టారు. దేశరాజధానితో పాటు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను మోహరించారు.