దేశ ప్రజలకు రాష్ట్రపతి బక్రీద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి):
దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వంతో మెలిగేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ కూడా దేశ ప్రజలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.