దోమల నిర్మూలనకు పూనుకోవాలి

ఏలూరు,సెప్టెంబర్‌27జనంసాక్షి: దోమలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ప్రయత్నం చేయాలని వైద్యాధికారులు పిలుపునిచ్చారు. దోమల నిర్మూలనతోనే విషజ్వరాలను దూరం చేసుకోగులుగుతామని అన్నారు. దోమలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అప్పుడే దోమలపై సమరం చేస్తేనే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. పరసరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. పరిసరాలు
పరిశుభ్రంగా ఉంటేనే దోమలు నిరోధించగలం. బహిరంగ మలవిసర్జన రహిత రాష్టాల్ల్రో దేశంలోనే ఏపీ ముందుండాలని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.