ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో లేదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ పలు వర్గాలు ధర్మాన రాజీనామాను ఆమోదించాలంటున్నాయని, కానీ, ధర్మాన రాజీనామా తనకు ఇంకా చేరలేదని తెలిపారు. ధర్మాన రాజీనామాను ఆమోదించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుని తనకు తెలపాలన్నారు. అప్పుడే ఆమోదం తెలుపుతానని వివరించారు. రాజ్యాంగం ప్రకారం మంత్రులు తమ రాజీనామాలను ముఖ్య మంత్రికి అందజేస్తే, సీఎం గవర్నర్‌కు పంపించాల్సి ఉం టుందన్నారు. ఈ నియమం ప్రకారం సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తనకు మంత్రి ధర్మాన రాజీనామాను ఇంకా పంపించలేదని, సీఎం ఒకవేళ పంపిస్తే ఆ రాజీనామాను ఆమోదిస్తానని గవర్నర్‌ తెలిపారు.