ధోనీ సేనపై ప్రశంసల వర్షం

– ధావన్‌, జడేజా, కొహ్లీలకు కితాబు

ఢిల్లీ : ఇంగ్లండ్‌ గడ్డపై అద్బుత ఆటతీరుతో ఛాంపియన్స్‌ ట్రోఫి మిని వరల్డ్‌ కప్‌ సాధించిన ధోనీ సేనపై ప్రశంసల కర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఛాంపియన్స్‌ ట్రోఫిలో అసాథారణ ఆటతీరు కబర్చిన శిఖర్‌ ధావన్‌, జడెజా, కోహ్లీలను మాజీ ఆటగాళ్లు ఆకాశాకెత్తేస్తున్నారు. 2015 ప్రపంచకప్‌కు భారత జట్టు ఆయుధాల్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు అనుభాంబుల వంటివారని భారత జట్టు మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ పేర్కొన్నారు.వచ్చే ప్రపంచ కప్‌కు ధోనీ బృందంలో శిఖర్‌ ధావన్‌, కోహ్లీ, జడేజా, సురేశ్‌ రైనా కీలకపాత్ర పోషించనున్నారని జోస్యం చెప్పారు. అయితే ఆటగాళ్లు ప్రస్తుత ప్రదర్శన నిలకడగా కొనసాగించాలని సూచించారు. కొన్ని మ్యాచుల్లో ఓడినప్పటికీ ప్రస్తుత జట్టున కొససాగించాని పేర్కొన్నాడు.

టోర్నమెంట్‌ మొత్తం ఈ జట్టునే కొనసాగించడం మంచిదేని జట్టు మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నాడు.