నకిలీ విత్తన విక్రేతలపై చర్యకు డిమాండ్‌

మహబూబాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. వేరుసెనగ సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాలతో సాగుచేపట్టారు. గతంలో ఇలా నష్టపోయామమని, విత్తనాలు వేసి 20 రోజులు గడిచినా పది శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు విక్రయించిన వ్యాపారి ఎలాంటి రశీదు ఇవ్వలేదని, నాణ్యతలేని గింజలను విత్తనాలకు విక్రయించాడని ఆరోపించారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.