నక్సల్ సమస్యపై కఠిన వైఖరి అవలంబిస్తాం : షిండే
న్యూఢల్లీి : ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే పేర్కొన్నారు. దేశ అంతర్గత భద్రతపై ఢల్లీిలోని విజ్ఞాన్భవన్లో జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో షిండే ప్రసంగించారు. నక్సల్ సమస్యపై కఠిన వైఖరి అవలంబిస్తామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు వదిలి వచ్చే ఏ తీవ్రవాద సంస్థతోనైనా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడిరచారు.