నాగోబా దేవాలయ పున: ప్రతిష్టాపన.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్
ఇంద్రవెల్లి ,డిసెంబర్ 18,జనం సాక్షి,   కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్యదైవం మేస్రం వంశ ఇలావేల్పు నాగోబా నూతన దేవాలయం, విగ్రహ పున:ప్రతిష్టపన కార్యక్రమంలో మేస్రం వంశ పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది… ఈ కార్యక్రమంలో  డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ లను  నాగోబా చిత్రపటం,తలపాగా చుట్టి సత్కరించారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని
రాబోయే రోజుల్లో నాగోబా ఆశీర్వాదంతో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రావాలి అని,ఆలయ అభివృద్ధికి పార్టీ తరపున కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంను, జిల్లా నాయకత్వంను, కార్యకర్తలను, కాపాడాలి అని నాగోబా ను  ఈ సందర్భంగా వేడుకున్నారు
ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మేస్రం.వెంకట్ రావ్
మేస్రం వంశ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మేస్రం.శేఖర్ బాబు ఆలయ చైర్మన్ మేస్రం.బాధిరావ్
జిల్లా ప్రధాన కార్యదర్శి ఖడే.సంతోష్
బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే.గజేందర్
జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బేధోడ్కర్.మోతీరం
జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సెద్మకి.ఆనందరావు
ఇచ్చోడా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెం.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు