నితీష్ సర్కారుకు సీపీఐ మద్దతు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీతో 17 ఏళ్లుగా కొనసాగుతున్న దోస్తీని జేడీ(యూ) తెగతెంపులు చేసుకోవడాన్ని సీపీఐ స్వాగతించింది. బుధవారం బీహార్ శాసనసభలో జరటనున్న బలపరీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నితీష్కుమార్ ప్రభుత్వానారా అనుకూలంగా ఓటు వేస్తారని సీపీఐ సెంట్రల్ సెక్రటేరియల్ ఒక ప్రకటనలో తెలిపింది. రేపు బీహార్ బంద్కు బీజేపీ పిలుపునివ్వడాన్ని సీపీఐ, సీపీఐ-ఎమ్ఎల్ (లిబరేషన్) వ్యతిరేకించాయి.