నిరుపేద వధువు వివాహానికి పుస్సే మట్టెలు అందజేత.
దౌల్తాబాద్ ఆగష్టు 24, జనం సాక్షి.
నిరుపేదలకు అండగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన సంద సత్తయ్య, ఇంద్రవ్వ కూతురు మనీషా వివాహ నిమిత్తం ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి-అశోక్ లు పుస్తే మట్టెలు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీమోద్దిన్ లు బియ్యాన్ని అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
నిరుపేదలకు కొండంత బాసటగా ఏఎంసీ డైరెక్టర్ అశోక్ మాధవి, జిల్లా కోఆప్షన్ రహిమోద్దిన్ లు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడకండి శ్రీనివాస్ గుప్తా,
నాయకులు జనార్దన్ రెడ్డి, జోడు నాగులు, నాగరాజు,భాను, తదితరులు పాల్గొన్నారు.
