నేటి ఉదయం ఎపి కేబినేట్‌ భేటీ

అమరావతి,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): బుధవారం ఉదయం 8 గంటలకు ఎపి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం చెప్పే అవకాశం ఉంది. ఈ నెల 14 న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని ప్రభుత్వం అంచనా వేయడంతో మంత్రివర్గ భేటీ కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే 7 జిల్లాల పరిధిలో కోడ్‌ అమల్లో ఉండనుండగా, మరో వైపు.. వెంటనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా రానున్నట్లు సమాచారం.