నేటి నుంచి మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌

ముంబయి: మహిళల క్రికెట్‌లో ప్రపంచకప్‌ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల పదో వన్డే ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభకానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు భారత్‌ వెస్టిండీన్‌తో తలపడుతోంది. మధ్యాహ్న 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ క్రికెట్‌ ఛానలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటివరకు టైటిల్‌ నెగ్గని భారత్‌ సొంతగడ్డపైన కప్‌ గెలవాలని క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు.