నేటి నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుదారుల విచారణ

ఆర్డీవో బి చెన్నయ్య
మిర్యాలగూడ, జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసే విషయంలో మంగళవారం నుండి దరఖాస్తు పరిశీలన ప్రారంభించనున్నట్లు మిర్యాలగూడ ఆర్ డి ఓ బి చెన్నయ్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బీచ్ చెన్నయ్య అధ్యక్షతన జరిగిన డబుల్ బెడ్ రూమ్
సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల విచారణ ప్రక్రియ సమయంలో విచారణ బృందాలు వచ్చినపుడు అవసరమైన సమాచారం, డాక్యుమెంట్స్ అందజేయవలసిందిగా కోరారు . ఎస్సీ ఎస్టీ దరఖాస్తులకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం అవసరముంటుందని,.
తప్పుడు సమాచరం ఇచ్చి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించినట్లయితే తగు చర్యలు గైకొనబడునన్నారు . అర్హులైన లబ్బిదారులను ఎంపిక చేయటంలో విచారణ బృందాలకు సహకరించవలసినదిగా కొరారు . దరఖాస్తు పరిశీలన సమయంలో విచారణ అధికారులు పరిశీలించాల్సిన అంశాలపై ఆయన వివరించారు. సమీక్ష సమావేశంలో నాయక్ తాసిల్దార్లు, మెప్మా ప్రతినిధులు, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.