నేడు ఇంగ్లాండ్తో భారత్ పోరు
మహిళల వన్డే ప్రపంచకప్
ఉదయం 9 నుంచి స్టార్ క్రికెట్లో
ముంబయి : వెస్టిండీన్పై భారీ విజయంతో మహిళల వన్డే ప్రపంచకప్లో శుభారంభం చేసిన భారత జట్టుకు అసలైన సవాల్. ఆదివారం ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే గ్రూప్-ఎ మ్యాచ్లో మిధాలీ సేన.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్కు సూపర్- 6 బెర్తు దాదాపుగా ఖరారవుతుంది. ఐతే ఆరంభ మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓటమితో రగిలిపోతున్న ఇంగ్లాండ్ను ఓడించడం మిథాలీ సేనకు అంత సులువు కాదు. ప్రపంచకప్కు ముందు భారత జట్టు మ్యాచ్ ఆడి చాలా కాలం కావడంతో టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అన్న అనుమానాలుండేవి. వాటిని పటాపంచలు చేస్తూ భారత అమ్మాయిలు ఆరంభ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. ఇటీవల బాగా మెరుగైన విండీన్ను ఓడించడం జట్టులో విశ్వాసం నింపింది.