నేడు కియో కారు లాంచ్ చేయనున్న బాబు
అనంతపురం,జనవరి28(జనంసాక్షి): కియో కార్ల కంపెనీ ఏర్పాటుపై విమర్శలను పటాపంచలు చేస్తూ తొలి కారును గమంగళవారం సిఎం చంద్రబాబు విడుదల చేయబోతున్నారు. పెనుకొండ మండలం, అమ్మవారి పల్లి దగ్గర ప్రతిష్టత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమలో తయారైన మొట్టమొదటి కారు ట్రయల్ రన్కు సిద్ధమైంది. మంగళవారం సీఎం చంద్రబాబు కియా కారును లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసేలా కియా కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశిరచుకుంది. ఇందుకు అనుగుణంగా అత్యాధునిక రోబోటెక్ టెక్నాలజీతో యంత్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం కార్మికులు బిగించిన కియా తొలి కారును చంద్రబాబు విడుదల చేసి.. స్వయంగా నడుపుతారు.