నేడు కేంద్ర ఎన్నికల బృందం రాక
అమరావతి,ఫిబ్రవరి11(జనంసాక్షి): కేంద్ర ఎన్నికల సంఘం ఎపిలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. లోక్సభ, శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై ఈసి సవిూక్షలు నిర్వహించనుంది. మంగళవారం నోడల్ అధికారులు, పోలీస్, రవాణా శాఖ, ఆదాయ పన్ను, వాణిజ్య పన్ను, రైల్వే, ఎయిర్ పోర్ట్ అధికారులతో సవిూక్ష నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుండి సిఇసి బృందం రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. సాయంత్రం కలెక్టర్లు, ఐజి లు, ఎస్పి లు ఇతర అధికారులతో భేటీ కానుంది. సిఎస్, ¬ం శాఖ సెక్రటరీలతో భేటీ కానుంది. ఈ భేటీలో సిఇసి సునీల్ అరోరా, ఇతర అధికారులు పాల్గొననున్నారు.