నేడు నగదు బదిలీ పథకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్ష

న్యూఢిల్లీ:  నగదు బదిలీ పథకం అమలుకు ఇంకా రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం అమలుకు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఈ భేటీలో సమీక్షించనున్నారు. ఈ పథకాన్ని జనవరి 1 నుంచి 35 జిల్లాల్లో ప్రవేశపెట్టాలని, అనంతరం జనవరి 10 నుంచి మిగితా 51 జిల్లాలకు విస్తరింంపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం తెలిసింది.