నేడు మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ , భవిష్యత్‌ కార్యచరణ నిమిత్తం ఏర్పాటైన 10 మంది మంత్రుల కమిటీ ఈరోజు మారోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో ఉదయం 11 గం.లకు  ప్రారంభమవుతుంది. ఆదివారంనాటి సమావేశంలో పార్టీ, ప్రభుత్వ బలాలు-బలహినతలకు సంబంధించి 45 అంశాలను గుర్తించిన అమాత్యులు ఆ సమావేశాన్నికి కొన్ని అంశాలు  ఎంచుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, సంక్షేమ పథకాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడం , శ్రేణుల మధ్య సమన్వయం తదితర అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.