నేడు మరోసారి ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం

న్యూఢల్లీి : దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ అజాద్‌తో భేటీ కానున్నారు. నిన్న అజాద్‌తో గంటపాటు ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. మంత్రివర్గంలో మార్పులుచేర్పులపై ముఖ్యమంత్రి నేడు పలుపురు అధిష్ఠానం పెద్దలతో సమావేశం కానున్నట్లు సమాచారం.