నేడు వీసీ శుక్లా అంత్యక్రియలు
ఛత్తీస్గఢ్,(జనంసాక్షి): చత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యవుతో పోరాడిన కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా అంత్యక్రియలు ఈ రోజు ఆయన ఫామ్హౌజ్లో జరగనున్నాయి. ఛత్తీస్గఢ్లోని లభండీ గ్రామంలో రాధేశ్యామ్ భవన్ పేరుతో నిర్మించుకున్న ఫామ్హౌస్లో వీసీ శుక్లా తన కోసం దహనవాటిక నిర్మించుకున్నారు.