నేడే మల్దకల్, బిజ్జారం లో విద్యుత్ అంతరాయం

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 20 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా నది అగ్రహారం మార్గం లో ఉన్న 132 కె వి గద్వాల సబ్ స్టేషన్ లో ఉన్న 33 కె వి ఫీడర్లు మల్దకల్, బిజ్జారం మంగళవారం ఉదయం 07:00 గం. నుంచి 09:30 గం వరకు 33 కెవి లైన్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని గద్వాల ఏ డి ఇ రమేష్ బాబు తెలిపారు. 33 కెవి ఫీడర్ల పరిధిలో ఉన్న ఉప కేంద్రాలకు కూడా విద్యుత్ అంతరాయం ఉండునాని రైతులు,
వినియోగదారులు అందరూ సహకరించగలరనీ ఆయన అన్నారు.