నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నటికీ ఎన్డీయేలో భాగం కాదు: ఒమర్‌

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎప్పటికీ ఎన్డీయేలో భాగం కాజాలదని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. 3 లోక్‌సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఉన్న తమ పార్టీ ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోదన్నారు. గతంలో కేవలం వాజ్‌పేయి కారణంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ భాజపాతో పొత్తు పెట్టుకుందని, ఇకముందు అలాంటి సందర్భం తలెత్తదని అయన పేర్కొన్నారు.