నేషనల్ కబడ్డీ టీంకు సెలెక్ట్ అయిన అన్విత

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి)
రాష్ట్ర కబడ్డీ తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జగదీష్ యాదవ్ , మరియు వైస్ ప్రెసిడెంట్ ఎండి అజీజ్ ఖాన్ ఆశీస్సులతో కుమారి  మెరుగు అన్విత తెలంగాణ కబడ్డీ జట్టు జూనియర్ నేషనల్ టీంకు సెలక్షన్ కావడం జరిగింది. గురువారం నుండి బీహార్లో జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్ షిప్ పాల్గొనడం  కోసం వెళుతున్న శుభ సందర్భంగా, వరంగల్ జిల్లా  కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ,సోదా. రామకృష్ణ , వైస్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి రామ్ రెడ్డి , జనరల్ సెక్రెటరీ , మొహమ్మద్ అబ్దుల్ల ఖాన్ , జైంట్ సెక్రెటరీ కె మల్లికార్జున్ గారు, ఖిల వరంగల్  మండల అధ్యక్షులు  కార్యదర్శులు జోగు నారాయణ  , మిర్జా ఇనాయతుల్ల బైగ్ (అత్తర్) , హస్సన్  మరియు క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.