నైజీరియాలో ఘోర ప్రమాదం: 100 మంది మృతి

jjuu8cxz హైదరాబాద్‌: నైజీరియాలోని నేవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 100 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్‌ నింపుతుండగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలడంతో ప్రమాదం జరిగిదని స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రిస్మస్‌ పండుగ రోజు భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో నేవీ ప్రాంతంలో విషాదం నెలకొంది.