న్యాయవ్యవస్థ దైవత్వంతో కూడుకున్నది : మోడీ

rez98vwaన్యూఢిల్లీ : న్యాయవ్యవస్థ చేస్తున్న పని దైవత్వంతో కూడుకున్నదని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ – సుపరిపాలన అంశంపై జరిగిన సదస్సులో మోడీ ప్రసంగించారు. మోడీ ప్రసంగం.. సమాజంలో న్యాయవ్యవస్థపై బృహత్తర బాధ్యత ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి సామాన్యులు ఎంతో ఆశిస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. భవిష్యత్ తరాల కోసం ఉత్తమ న్యాయవ్యవస్థను తయారు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. వ్యక్తులు మంచివాళ్లే.. వ్యవస్థలోనే ఎక్కడో లోపముంది.. సవరించాల్సిన అవసరం ఉంది.