న్యూ బోయినపల్లి జయనగర్ శివ సాయి రామ్ ఆలయం అభివృద్ధికి సహకారం అందించిన దాతలు వరలక్ష్మి వరప్రసాద్ రావు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంపన ప్రతాప్ 
 
 
కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 17  జనం సాక్షి న్యూ బోయినపల్లి జయనగర్ కాలనీలోని శివ సాయిరామ్ దేవస్థానం లో కొలువై ఉన్న సాయిబాబా కు వెండి సింహసనం చేయించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు.
ఇందుకు సంబంధించి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందచేస్తున్నారు, న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనీ కి చెందిన వరప్రసాద్ రావు,వరలక్ష్మి దంపతులు వెండి సింహసనం కోసం 51 వేల రూపాయలను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వాహకులకు అంద చేసి రసీదు పొందారు. అదేవిధంగా బాపూజీ నగర్ కు చెందిన కె.నర్సింగ్ రావు పావు 1/4 కేజీ వెండిని,ఇతని కుమార్తె డాక్టర్ కె.ధనలక్ష్మి 15 తులాల వెండిని సింహసనం కోసం కమిటీ నిర్వాహకులకు జంపన ప్రతాప్ చేతుల మీదుగా అందచేసి రసీదు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ చందర్, దేవేరచంద్, శంకర్ రావు, నారాయణ పాల్గొన్నారు.
 శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవo లో పాల్గొన్న జంపన ప్రతాప్
    కార్తీక మాసము సందర్భంగా న్యూ బోయినపల్లి లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనముగా నిర్వహించారు. ఆలయ స్థానిక భక్తులు దామోదర గౌడ్, అపర్ణ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జంపన ప్రతాప్ ను ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు అర్.టీంకు గౌడ్,  వరప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు