పంజాబ్ పేలుడులో కీలక సమాచారం
ఇద్దరు వ్యక్తుల సిసి టివి ఫుటేజీ లభ్యం
అమృత్సర్,నవంబర్19(జనంసాక్షి): పంజాబ్లోని అమృత్సర్ పరిధిలోని సజ్సానీ గ్రామంలో జరిగిన
బాంబు పేలుడుకు సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో నిరంకారీ భవన్పై గ్రనేడ్ దాడికి దిగిన ఇద్దరు అనుమానితుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్ కప్పుకుని బైక్పై వస్తూ కనిపిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి జీన్స్, షర్ట్ ధరించివుండగా, మరొకరు కుర్తా-పైజమా ధరించారు. కాగా వీరిద్దరూ వస్తున్న బ్లాక్ పల్సర్ వాహనానికి నంబర్ ప్లేట్ లేనట్టు తెలుస్తోంది. కాగా అమృత్సర్లో ఆదివారం జరిగిన గ్రనేడ్ పేలుడులో ముగ్గురు మృతిచెందగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.