పట్టణ శోభను సంతరించుకుంటున్న జగదేవ్ పూర్

ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి
జగదేవ్ పూర్, నవంబర్ 17 (జనంసాక్షి):
పట్టణ శోభను సంతరించుకుంటూ జగదేవ్ మండల కేంద్రం అన్ని రంగాల్లో శరవేగంగా  అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ వి. యాదవరెడ్డిలు స్పష్టం చేశారు. గురువారం జగదేవ్ పూర్ సమీపంలోని ప్రధానరహదారిపై ఏర్పాటు చేసిన ఓ ప్రయివేటు వెంచర్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సరిహద్దున ఉన్న జగదేవ్ పూర్ మండల కేంద్రం మంచి వ్యాపారకేంద్రంగా మారి పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉందన్నారు. దీంతో పట్టణాలకు ధీటుగా అన్ని రంగాల్లో ఇక్కడ అభివృద్ధి చెందుతుండడం శుభ పరిణామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షుడు మెరుగు బాలేశంగౌడ్, ఎంపిటిసిలు కొత్త కవితాశ్రీనివాస్ రెడ్డి, ఎగ్బాల్, నాచారం దేవస్థానం డైరెక్టర్ బుద్ధ నాగరాజు టిఆర్ ఎస్ మండలాద్యక్షుడు పనగట్ల శ్రీనివాస్, వెంచర్ యజమాని రాఘవేందర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.