పతనమైన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. ఇవాళ స్టాక్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు విఫరీతంగా తగ్గిపోయాయి. బంగారం ధర తులానికి రూ.400 తగ్గిపోయి రూ.2000 కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1500 తగ్గిపోవడంతో దాని ధర 43,100 కు చేరుకుంది. రూపాయి విలువ భారీగా పడిపోవడం వల్లే వీటి ధరలు తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.