పదవీవిరమణ చేసిన వైద్యాధికారికి సన్మానం

మహబూబాబాద్‌,మే30(జ‌నం సాక్షి):  కంబాలపల్లి పీహెచ్‌సిలో 1989న ఉద్యోగంలో చేరి ఇంచార్జి డీపీహెచ్‌ఎంఓగా పదవీవిరమణ పొందుతున్న కల్లోజు సూరమ్మ వెంకన్న(కన్నా)ను పలువురు సన్మానించారు. ఆమె సేవలను క ఒనియాడారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  జేసీ దామోదర్‌ రెడ్డి ,తెరాస ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ పదవీవిరమణ అనేది జీవితంలో ప్రతీ ఉద్యోగికి సహజమైన పరిస్థితి అని,జీవితంలో సగభాగం ఉద్యోగ పర్వంలో ఎంతో మందికి తమ సేవలను అందించిన సూరమ్మ తన తర్వాతి జీవితం ఆనందకరంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. శ్రీరాం, డిప్యూటీ డీ ఎం హెచ్‌ ఓ రామారావు,డా. రాజేష్‌,   పీహెచ్‌ సీ ల సూపర్‌వైజర్‌ లు ఏ ఎన్‌ఎంలు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ జెర్రిపోతుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
———