పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
– మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వరకు పరీక్షల నిర్వహణ
– వెల్లడించిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్
విజయవాడ, పిబ్రవరి11(జనంసాక్షి) : ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. షెడ్యూల్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. మార్చి18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని.. వీరికోసం 2,833 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని గంటా చెప్పారు. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.
షెడ్యూల్ ఇలా..
మార్చి 18నఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1, 19న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2, 20న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ), 22న ఇంగ్లీష్ పేపర్-1, 23న ఇంగ్లీష్ పేపర్-2, 25న మ్యాథ్స్ పేపర్-1, 26న మ్యాథ్స్ పేపర్-2, 27 జనరల్ సైన్స్ పేపర్-1, 28 జనరల్ సైన్స్ పేపర్-2, 29న సోషల్ స్టడీస్ పేపర్-1, 30న
సోషల్ స్టడీస్ పేపర్-2 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.