పన్నూరులో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 జనం సాక్షి , రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పొన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను సోమవారం మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఆచరణకు నోచుకోలేదని, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధతో పన్నూరు గ్రామంలో ఆరు వాటర్ ప్లాంట్ ఏర్పాటు కల నెరవేరిందని పన్నూరు ఎంపిటిసి చిందం మహేష్ అన్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ను పన్నూరు గ్రామానికి కేటాయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఎంపీటీసీ మహేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్నూరు గ్రామ సర్పంచ్ అల్లం పద్మ, ఎంపీటీసీ చిందం మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రయ్య, మాజీ ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్ , బిసి సెల్ మండల అధ్యక్షుడు బండారి సదానందం, ఉడుత శంకర్ తదితరులు పాల్గొన్నారు