‘పరివర్తన్ యాత్ర’ వాయిదా
చత్తీస్గఢ్ : మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ ‘పరివర్తన్ యాత్ర’ను వాయిదా వేసుకుంది. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో పలువురు కాంగ్రెస్ నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ బంద్కి పిలుపిచ్చింది.