పలమనేరులో జ్ఞానభేరి సదస్సు ప్రారంభం
తిరుపతి,ఫిబ్రవరి15(జనంసాక్షి): టిడిపి ఆధ్వర్యంలో పలమనేరులో శుక్రవారం జ్ఞాన భేరి సదస్సును నిర్వహించారు. ‘ పరిశ్రమలతో ఉపాధి-నైపుణ్యాభివృద్ధి అవకాశాలు ‘ అనే అంశంపై సభలో వక్తలు ప్రసంగించారు. మంత్రి అమరనాథ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో 14 కాలేజీల నుండి 7 వేల మంది విద్యార్థులు పాల్గన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి శివప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ప్రముఖ రచయిత మోటివేటర్ యండమూరి వీరేంద్రనాథ్, జబర్దస్త్ నటులు, తదితరులు పాల్గొన్నారు.