పాకిస్థాన్‌లో బాంబు పేలుడు: 11 మంది మృతి

7fbzwxep హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ప్యాసింజర్‌ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మందికి మృతిచెందగా, మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక సాండేమాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కార్మికులేనని, పేలుడు వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక అధికారులు తెలిపారు. కెట్టా ప్రాంతంలోని సారియబ్‌ ఫ్లై ఓవర్‌పై బస్సు ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని, కెట్టా ప్రాంతంలో ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతుంటాయని అధికారులు పేర్కొన్నారు.