పాక్‌లో భారత ఖైదీపై కిరాతకం

న్యూఢిలీ/ జమ్మూ : చామల్‌ సింగ్‌ అనే భారత ఖైదీని పాకిస్థాన్‌లో రెండు నెలల క్రితం అమానుషంగా హింసించి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ జిల్లాకు చెందిన ఆయన గూఢచర్యం ఆరోపణలపై లాహోర్‌లోని కోట్‌ లక్‌పత్‌ జైల్లో ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. తీవ్ర గాయాలయ్యాయంటూ జైలు సిబ్బంది చామర్‌ను జనవరి 15న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన్ను మరణించినట్టు ఆస్పత్రి సిబ్బంది ధ్రువీకరించారు. జైలు సిబ్బంది విపరీతంగా కొట్టడమే మరణానికి కారణమని తెలుస్తోంది.