పాక్ కాల్పులు : భారత జవాను మృతి
శ్రీనగర్,నవంబర్8 (జనంసాక్షి) : పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ ఫూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. తెల్లవారుజామున 2:30 గంటలకు పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒక భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.