పాట్నాలో బీజేపీ నేతల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోడీ నివాసంలో బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరికాసేపట్లో జేడీయూ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావాలని బీజేపీ మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సుశీల్‌మోడీకి బీజేపీ మంత్రులు రాజీనామా సమర్పిస్తారని ఆ పార్టీ నేత సీపీ ఠాకూర్‌ తెలిపారు. ఇవాళ ఉదయం 12.30 గంటలకు మంత్రివర్గ అత్యవసర సమావేశానికి బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.