పాట్నాలో మహావీర్‌ దేవాలయం భద్రత పెంపు

పాట్నా: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో పాట్నాలోని మహావీర్‌ దేవాలయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవాలయం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్‌కె భరద్వాజ్‌ ప్రకటించారు. డాగ్‌స్క్వాడ్‌ని పంపించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నట్లు తెలిపారు. మంగళ, శనివారాల్లో ఈ దేవాలయంలో విపరీతమైన రద్దీ ఉంటుందని అలయ నిర్వాహకులు తెలిపారు.