పాఠశాల వ్యాన్‌ను ఢీకొన్న బస్సు..

– ఏడుగురు విద్యార్థులు, వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

భోపాల్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్నా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌ ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల వ్యాన్‌.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులతో పాటు వ్యాన్‌ డ్రైవర్‌ కూడా అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. రీవా-చిత్రకూట్‌ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బిర్సింగ్‌పూర్‌ వైపు వెళ్తున్న పాఠశాల వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో కూర్చున్న ఏడుగురు విద్యార్థులతో పాటు డ్రైవర్‌ కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12 మంది విద్యార్థులు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.