పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరినట్లే కనిపిస్తుంది. పార్టీ పదవులకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. గోవాలో జరిగిన భాజపా జాతీయ కర్యావర్గ సమావేశానికి ఆద్వానీ గైర్హాజరైన సంగతి తెలిసిందే. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీకి మోడీ నాయకత్వంపై అద్వానీ మనస్తాపం చెందినట్లు భావిస్తున్నారు.