పార్టీ పనితీరును జీర్ణించుకోలేకపోతున్నా: అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): గత కొద్ది కాలంగా భారతీయ జనతాపార్టీ పనితీరును తాను జీర్ణించుకోలేకపోతేన్నానని ఎల్‌కే అద్వానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పార్టీలో చాలామంది వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో తాను కొనసాగలేనని.. పార్టీ అధ్యక్షునికి రాసిన రాజీనామా లేఖలో అద్వానీ పేర్కొన్నారు. ఆయన జాతీయ కార్యవర్గం, పార్టమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశాడు.