పార్లమెంట్‌ ఉభయసభల్లో ఎస్పీ ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సమాజ్‌వాది పార్టీ నిరసనల మధ్య లోక్‌సభ ఈ ఉదయం రెండు సార్లు వాయిదా పడింది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బిల్లుకు వ్యతిరేకంగా ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో మొదట సభను 11.30కు స్పీకర్‌ వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై ఎస్సీ సభ్యుల ఆందోళనలు కొనసాగించాయి. దీంతో చెర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.