పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌..

ఏప్రిల్‌ నెలలో కట్‌ చేసిన 50 శాతం పింఛన్‌ వాపస్‌

రెరడు విడతలుగా చెల్లించేందుకు అంగీకారం!

అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ అందించింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో కట్‌ చేసిన 50 శాతం పింఛన్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ మొత్తాన్ని రెరడు విడతలుగా చెల్లించేందుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అలాగే మొదటి విడత మొత్తాన్ని డిసెంబర్‌ 1వ తేదీన విడుదలయ్యే పింఛన్‌ను అందజేస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు గవర్నమెంట్‌ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. దీనితో వారికి కరువు భత్యం 27.248 నుంచి 30.392 కు పెరిగిన విషయం విదితమే.