పీఎంవో అధికారులను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాని కార్యాలయ అధికారులను సీబీఐ ఇవాళ ప్రశ్నించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి గుప్తాను విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది. బొగ్గు కుంభకోణం కేసులో పీఎంవో అధికారులను సీబీఐ ప్రశ్నించడం ఇదే తొలిసారి.