పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పోత్తులపై రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఈ భేటీలో చర్చించనున్నారు. మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు.