పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్ సమావేశం
ఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా నియమితులైన రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల పార్టీ నేతలతో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరుపనున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.