పుణె రహదారిపై ఘోరప్రమాదం.. 17 మంది మృతి

5brk-39ముంబై: ముంబై- పుణె రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతిచెందారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, అధికారయంత్రాంగం ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.