పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాందీ 154వ జయంతి వేడుకలు

పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాందీ 154వ జయంతి వేడుకలు

రాయికల్,అక్టోబర్02(జనంసాక్షి)మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణములోని గాంధీ విగ్రహం దగ్గర గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనైనది. అనంతరం స్వచ్ఛత దివస్ సందర్భంగా పురపాలక సంఘం రాయికల్ నందు పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలతో సత్కరించటం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర రమాదేవి గారు, 3వ వార్డు కౌన్సిలర్ మారంపెల్లి సాయికుమార్ గారు, 4వ వార్డు కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి గారు,5వ వార్డు కౌన్సిలర్ వల్లకొండ మహేష్ గారు,10వ వార్డు కౌన్సిలర్ మ్యాకల కాంతారావు గారు, కోఆప్షన్ సభ్యులు పెండెల వనిత, మహమ్మద్ మెరాజోద్దిన్, కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు