పెట్టుబడి సాయం రైతులకు మేలు: ఎమ్మెల్యే

జనగామ,మే14(జ‌నం సాక్షి):రానున్న ఖరీఫ్‌ సాగులో రైతులకు పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుందని పాలకుర్తి  ఎమ్మెల్యే దయాకర్‌రావు అన్నారు. ఈరవెన్ను, దర్దేపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో ఆయన పాల్గొని పట్టా పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. రైతు కుటుంబాల్లో ఆనందం చూడడానికి సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గత కాంగ్రెస్‌ 
ప్రభుత్వ హయంలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఈరవెన్నులో ఎడ్లబండి నడిపి గ్రామస్థులను ఎమ్మెల్యే ఉత్సాహపరిచారు. టీఎస్‌కే తండాలో గిరిజనులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కళాకారులు నృత్యాలతో, పాటలతో ఆహ్వానించారు. సర్పంచులు ముస్కు రేవతి, జాహ్నవి, ఎంపీటీసీ సభ్యులు సులోచన, సుధ, తహసీల్దార్‌ బన్సీలాల్‌, రైసస మండలాధ్యక్షుడు యాకాంతరావ తదితరులు పాల్గొన్నారు.